భార్యతో గొడవ పడ్డ భర్త.. చివరికి ఏమైంది..?

by Naveena |   ( Updated:2025-04-16 12:44:06.0  )
భార్యతో గొడవ పడ్డ భర్త.. చివరికి ఏమైంది..?
X

దిశ, మేడిపల్లి: వ్యక్తి అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్ నవోదయ కాలనిలో జాటావత్ గోపాల్ (39), తన భార్య జాటావత్ సుగుణ ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నాడు. అయితే గోపాల్ ఈ నెల 11 నుంచి కనిపించడం లేదని భార్య ఫిర్యాదు చేసింది. తన భర్త అప్పుడప్పుడు మద్యం సేవించి తనతో గొడవపడి ఇంట్లో నుండి వెళ్ళిపోతాడని,రెండు, మూడు రోజుల తరువాత తిరిగి ఇంటికి వచ్చేవాడని పేర్కొంది. కానీ ఈ సారి వెళ్లి ఇన్ని రోజులు గడిచిన తిరిగి రాలేదని, బంధువులు, స్నేహితులను ఆడిగిన ఆచూకీ లభించలేదని వాపోయింది. అలాగే కేసు నమోదు చేసి.. విచారణ చేస్తున్నామని,ఎవరికైన సమాచారం తెలిసినచో మేడిపల్లి పోలీస్ స్టేషనలో సమాచారం ఇవ్వాలని సీఐ గోవింద రెడ్డి తెలిపారు.



Next Story

Most Viewed