నేడు లాల్ బజార్ మహంకాళి అమ్మవారి బోనాలు..

by Disha Web Desk 20 |
నేడు లాల్ బజార్ మహంకాళి అమ్మవారి బోనాలు..
X

దిశ, కంటోన్మెంట్/ బోయిన్ పల్లి : కంటోన్మెంట్ ఏడో వార్డులోని లాల్ బజార్ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు నేడు జరగనున్నాయి. బుధవారం అమ్మవారికి బోనాలు గురువారం ఆలయంలో రంగం భవిష్యవాణి కార్యక్రమాలు ఉంటాయని ఆలయ ఈవో మహేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం సికింద్రాబాద్ మహంకాళి దేవాలయం నుంచి లాల్ బజార్ అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకొచ్చారు. అలాగే అమ్మవారి ఘటం ఊరేగింపు ఊరి పొలిమేర తిరుమలగిరి గాంధీ సామాజిక భవనం నుంచి ప్రారంభం అని తెలిపారు.

రెండు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవాలకు తిరుమలగిరి నుంచే కాకుండా, పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ఉత్సవాలను తిలకిస్తుంటారని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. నేడు ఆలయానికి వీఐపీలు కూడ రానున్నారని, భద్రత చర్యలు కూడ తీసుకుంటామన్నారు. ఉదయం మాజీ బోర్డ్ సభ్యులు గౌరీ శంకర్ కుటుంబ సభ్యులు అమ్మవారికి తొలి బోనం సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

Next Story

Most Viewed