షాపుకు వెళ్లిన యువతి అదృశ్యం..!

by Disha Web Desk 11 |
షాపుకు వెళ్లిన యువతి అదృశ్యం..!
X

దిశ, మల్కాజిగిరి: ఇంటి నుంచి షాపుకు వెళ్తానని చెప్పి వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నరసింహా స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. వినాయక్ నగర్ ప్రాంతానికి చెందిన సౌజన్య (19), ఎఎస్ రావునగర్ చెన్నై షాపింగ్ మాల్ లో పనిచేస్తోంది. అయితే సోమవారం ఉదయం షాపుకు వెళ్లి వస్తానని చెప్పి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తల్లి జయ సౌజన్య ఆచూకీ కోసం ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story