జనవరి 25న ఘట్కేసర్ గట్టు మైసమ్మ జాతర...

by Taduka Kalyani |

జిహెచ్ఎంసి ఎల్ బి నగర్ జోన్ ఘట్కేసర్ సర్కిల్ లోని ఘట్కేసర్ గట్టు మైసమ్మ జాతరను 2026 జనవరి 25న నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ ఆలయం ఈఓ భాగ్యలక్ష్మి తెలిపారు.

జనవరి 25న ఘట్కేసర్ గట్టు మైసమ్మ జాతర...
X

దిశ, ఘట్కేసర్ః జిహెచ్ఎంసి ఎల్ బి నగర్ జోన్ ఘట్కేసర్ సర్కిల్ లోని ఘట్కేసర్ గట్టు మైసమ్మ జాతరను 2026 జనవరి 25న నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ ఆలయం ఈఓ భాగ్యలక్ష్మి తెలిపారు. ఆదివారం ఘట్కేసర్ పాత మున్సిపల్ కార్యాలయం ఆవరణలో గ్రామ పెద్దలు, కుల వృత్తుల పనివార్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఘట్కేసర్ లో ప్రతి రెండు సంవత్సరలకు ఒకసారి జనవరి నెలలో 11వ తేదీన నిర్వహించే నడిఊర్ల పండుగ, ప్రతి సంవత్సరం జనవరి నెల 25న గట్టు మైసమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు నిర్వహించేందుకు తీర్మానించినట్లు భాగ్యలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమం లో కుల పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story