- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బీజేపీకి బుద్ది చెప్పే రోజులు దగ్గర పడుతున్నాయ్: ఎమ్మెల్సీ పల్లా
దిశ, కుత్భుల్లాపూర్: తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోసం అడ్డదారులు తొక్కుతూ అసత్య ప్రచారం చేస్తున్న బీజేపీకి బుద్ది చెప్పే రోజులు దగ్గర పడుతున్నాయని రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, బీఆర్ఎస్ జిల్లా ఇంచార్జి, ఎమ్మెల్సీ శ్రీ డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలో స్థానిక కార్పొరేటర్ బి విజయ్ శేఖర్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర పర్యటనలో భాగంగా వచ్చిన ప్రధాని మోడీ పచ్చి అబద్ధాలు చెప్పారని ధ్వజమెత్తారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దూసుకెళ్తుంటే, బీజేపీ నేతలు అక్కసుతో మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారనే అక్కసుతో బీజేపీ అనేక కుట్రలకు దారి తీస్తుందని, అటువంటి ప్రయత్నాలను ఎక్కడికక్కడ ఎండగట్టాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఏర్వ శంకరయ్య, ప్రధాన కార్యదర్శి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
విద్యార్థుల జీవితాలతో ఆటలొద్దు.. కేసీఆర్ సర్కార్కు నారాయణ మూర్తి సూచన