అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా తెలంగాణ: మంతి శ్రీనివాస్​ గౌడ్​

by Disha Web Desk 11 |
అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా తెలంగాణ: మంతి శ్రీనివాస్​ గౌడ్​
X

దిశ, కూకట్​పల్లి: తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో అంతర్జాతీయ కంపెనీలు ముందుకు వస్తున్నాయని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని క్రీడలు, ఎక్సైజ్​ శాఖ మంత్రి వి. శ్రీనివాస్​ గౌడ్​ అన్నారు. కూకట్​పల్లి నియోజకవర్గంలో ఆదివారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో హెడా ట్రక్​ పార్కు వద్ద నిర్వహించిన మెగా జాబ్​ మేళా కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. శాంతి భద్రతల విషయంలో, మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం చేపడుతుందని అన్నారు.

దేశంలో అనేక రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రాన్ని, బీఆర్​ఎస్​ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకునే విధంగా సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. జాబ్​ మేళాలో 9 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, వందకు పైగా కంపెనీలు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు తీసుకున్నారని అన్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 3 వేల మందికి అక్కడికక్కడే నియామక పత్రాలను అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్​ బొంతు రామ్మోహన్​, కార్పొరేటర్లు ముద్దం నర్సింహా యాదవ్​, మందాడి శ్రీనివాస్​ రావు, ఆవుల రవీందర్​ రెడ్డి, సబీహ బేగం, పండాల సతీస్​ గౌడ్, జూపల్లి సత్యనారాయణ, పగుడాల శిరీష, మాజీ కార్పొరేటర్​ తూం శ్రావణ్​ కుమార్​, డీసీ రవి కుమార్​ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed