చీటింగ్ దందాకు ఎస్ఓటీ చెక్.. నలుగురు నిందితులు అరెస్ట్..

by Disha Web Desk 11 |
చీటింగ్ దందాకు ఎస్ఓటీ చెక్.. నలుగురు నిందితులు అరెస్ట్..
X

దిశ, కుత్బుల్లాపూర్: బ్రాండెడ్ వాటర్ ఫిల్టర్ కంపెనీ లోగోలు వాడుతూ నకిలీ పరికరాలు సరఫరా చేస్తున్న ముఠాకు బాలానగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు చెక్ పెట్టారు. వివరాలు డీసీపీ శ్రీనివాస్ రావు వెల్లడించారు. కెంట్, ఆక్వాగార్డ్ వాటర్ ఫ్యూరిపయర్ కంపెనీ లోగోలు వాడుతూ ఆయా కంపెనీల డీలర్లు వినియోగదారులను మోసం చేస్తున్నారు. కేపీహెచ్ బీ, కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ ల పరిధిలో రింకు నవి, శ్రావణ్ నిషాద్, ప్రదీప్ జైన్, పామర్తి నాగరాజు కంపెనీల లోగోలు తయారు చేస్తూ వాటర్ ఫిల్టర్ పరికరాలు కంపెనీ వస్తువులుగా నమ్మిస్తూ వినియోగదారులని మోసం చేస్తున్నారు.

నకిలీ వస్తువులు తయారు చేసి లోగోలు మార్చి కస్టమర్స్ కు అంటగడుతున్న చీటింగ్ దందాను పోలీసులు పటాపంచలు చేశారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సుమారు రూ. 11 లక్షల విలువ గల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఏసీపీ చంద్రశేఖర్, కూకట్పల్లి, కేపీహెచ్ బీ కాలనీ ఎస్ హెచ్ఓలు, ఎస్ఓటీ పోలీసులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed