నిషేధిత డ్రగ్స్​, గంజాయి సరఫరా చేస్తున్న నిందితుల రిమాండ్​..

by Disha Web Desk 11 |
నిషేధిత డ్రగ్స్​, గంజాయి సరఫరా చేస్తున్న నిందితుల రిమాండ్​..
X

దిశ, కూకట్​పల్లి: నిషేధిత డ్రగ్స్ ఎండీఎంఏ​, గంజాయి విక్రయిస్తున్న నిందితులను కూకట్​పల్లి పోలీసులు, బాలానగర్​ ఎస్​ఓటీ పోలీసులు శనివారం అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. వారి వద్ద నుంచి 1.7 కిలోల గంజాయి, 2.20 లక్షల విలువ చేసే 29 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ చంద్రశేఖర్​, సీఐ సురేందర్​ గౌడ్​లు వివరాలు వెళ్లడించారు. కూకట్​పల్లిలో బెంగుళూరు నుంచి డ్రగ్స్​ను దిగుమతి చేసి సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు కూకట్​పల్లి లా అండ్​ ఆర్డర్​ పోలీసులు, బాలానగర్​ ఎస్​ఓటీ పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.

కూకట్​పల్లి వై జంక్షన్​లో అనుమానస్పదంగా కనిపించిన బెంగళూరుకు చెందిన యూసఫ్​ షరీఫ్​(27), షబాజ్​ ఖాన్​(21)లు ఇద్దరు అన్నదమ్ముళ్లను అదుపులో తీసుకుని విచారించగా బెంగుళురు నుంచి డ్రగ్స్​ను తరలిస్తున్నట్టు నేరం అంగీకరించారు. బెంగుళూరులో ఓ వస్త్ర దుకాణంలో సేల్స్​ బాయ్స్ ​గా పని చేస్తున్న ఇద్దరు సులువుగా డబ్బులు సంపాదించాలనే దురాశతో డ్రగ్స్​ స్మగ్లర్లుగా అవతారమెత్తారు. బెంగుళూరు నుంచి డ్రగ్స్​ సరఫరా చేయడం ప్రారంభించినట్టు ఏసీపీ చంద్రశేఖర్​ తెలిపారు.

అదే విధంగా వైజాగ్​ నుంచి హైదరాబాద్​కు గంజాయిని తరలించి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు శనివారం అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. వారి వద్ద నుంచి 1.7 కేజీల గంజాయి, ఓ మొబైల్​ ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు. మూసాపేట్​ జనతానగర్​కు చెందిన దుప్పల నరేష్​(22), వైజాగ్​కు చెందిన బాలాజీలు వైజాగ్​ నుంచి గంజాయిని తరలించి విక్రయించేందుకు ప్రయత్నిస్తుండటంతో బాలానగర్​ ఎస్​ఓటీ పోలీసులు, కూకట్​పల్లి లా అండ్​ ఆర్డర్​ పోలీసులు దాడి నిర్వహించారు. గంజాయి సరఫరా చేస్తున్న దుప్పాల నరేష్​ను అదుపులో తీసుకోగా బాలాజీ అనే మరో నిందితుగడు పరారీలో ఉన్నట్టు ఏసీపీ చంద్రశేఖర్​ తెలిపారు. కేసును చేధించిన బాలానగర్​ ఎస్​ఓటీ సిఐ రాహుల్​ దేవ్​, కూకట్​పల్లి డీఐ ఆంజనేయులు, సిబ్బందిని ఏసీపీ అభినందించారు.

Next Story

Most Viewed