మిని ట్యాంక్ బండ్​గా రంగధాముని చెరువు: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

by Disha Web Desk 11 |
మిని ట్యాంక్ బండ్​గా రంగధాముని చెరువు: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
X

దిశ, కూకట్​పల్లి: రంగధాముని చెరువును మిని ట్యాంక్​ బండ్​గా సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. నియోజకవర్గం పరిధిలోని బాలాజీనగర్​ డివిజన్​లో జరుగుతున్న రంగధాముని చెరువు సుందరీకరణ, అభివృద్ధి పనులను, పార్కులు, షటిల్​ కోర్టులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శనివారం స్థానిక కార్పొరేటర్​ పగుడాల శిరీష బాబురావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలోని ట్యాంక్​ బండ్​ను పోలినట్టు రంగధాముని చెరువును మిని ట్యాంక్​ బండ్​గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కూకట్​పల్లి వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, మంచి ఆరోగ్యాన్ని అందించడమే లక్ష్యంగా పార్కులు, ఓపెన్​ జిమ్​ లు, క్రీడా మైదానాలు అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్​ బాబురావు, డీఈ ఆనంద్, ఏఈ శ్రీనివాస్​ తదితరులు పాల్గొన్నారు.

కేపీహెచ్​బీ డివిజన్​లో...

కేపీహెచ్​బీ డివిజన్​ పరిధిలోని రమ్య గ్రౌండ్​ సమీపంలో నిర్మిస్తున్న ప్రభుత్వ పాఠశాల నిర్మాణ పనులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్థానిక కార్పొరేటర్​ మందాడి శ్రీనివాస్​ రావుతో కలిసి పరిశీలించారు. డివిజన్​ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్​ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ప్రభాకర్​ గౌడ్​, సాయిబాబా చౌదరి, అడుసుమల్లి వెంకటేశ్వర్​ రావు, శ్యామల రాజు తదితరులు పాల్గొన్నారు.


Next Story