మానవత్వంతో స్పందించిన రాచకొండ కమిషనర్..

by Taduka Kalyani |

తనకు న్యాయం చేయాలని కోరుతూ బాలుడు రాచకొండ కమిషనర్ కార్యాలయానికి చిన్నాన్న నరేష్ రెడ్డితో కలిసి వెళ్లారు.

మానవత్వంతో స్పందించిన రాచకొండ కమిషనర్..
X

దిశ, కీసర: తనకు న్యాయం చేయాలని కోరుతూ బాలుడు రాచకొండ కమిషనర్ కార్యాలయానికి చిన్నాన్న నరేష్ రెడ్డితో కలిసి వెళ్లారు.

ఫిబ్రవరి లో చీర్యాల గ్రామ పరిధిలోని ఓ ప్రముఖ గురుకుల పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 6 వ తరగతి బాలుడు తుమ్మల హనివర్ధన్ పాఠశాల యాజమాన్యం పట్టించుకోవడం లేదని కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన కమిషనర్ స్వయంగా వచ్చి ఫిర్యాదు స్వీకరించి బాలుడి వైద్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల మేనేజ్ మెంట్ప పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తగిన న్యాయం చేస్తానని బాలుడికి హామీ ఇచ్చారు.

Next Story