కూకట్ పల్లిలో మందకొడిగా పోలింగ్..

by Disha Web Desk 23 |
కూకట్ పల్లిలో మందకొడిగా పోలింగ్..
X

దిశ,కూకట్ పల్లి: కూకట్పల్లి నియోజకవర్గం లో పోలింగ్ మందు కోడిగా సాగుతుంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ 11 గంటల వరకు 14.90 శాతం, ఇంటి గంట వరకు 22 శాతం, 3 గంటల వరకు 32.74 శాతం నమోదైంది. నియోజకవర్గంలో పోలింగ్ లో పాల్గొనేందుకు ప్రజలు పెద్దగా ముందుకు రాకపోవడం తో పోలింగ్ శాతం తగ్గిందని చెప్పవచ్చు. కూకట్ పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులు మాధవరం కృష్ణారావు, మమ్మా రెడ్డి ప్రేమ్ కుమార్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్, టీపీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం, కార్పొరేటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజక వర్గంలో మొత్తం 4,63,864 ఓట్లు ఉండగా 3 గంటల వరకు కేవలం 32.74 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.






Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed