రాజాసింగ్ కు మ‌రో బిగ్ షాక్ !

by velandi.Saikiran |   (  Updated:2026-06-05 19:30:52  IST  )

రాజాసింగ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు ముస్లిం సంఘ సభ్యులు.

రాజాసింగ్ కు మ‌రో బిగ్ షాక్ !
X

దిశ, జవహర్నగర్: రాజాసింగ్ కు మ‌రో బిగ్ షాక్ త‌గిలింది. త‌మ‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కోరుతూ జవహర్ నగర్ ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని దుర్మార్గమైన మాటలు మాట్లాడటం తగదని, మత విద్వేశాలను రెచ్చగొట్టేలా చేస్తున్న రాజాసింగ్ పై కేసు నమోదు చేయాలని పేర్కొన్నారు. ఇక ఈ ఫిర్యాదును స్వీకరించిన జవహర్ నగర్ పోలీసులు, విచారణ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు రఫిక్, మతిన్, అహ్మద్ పాషా, అలీ, అక్రమ్, ఆప్రోజ్, మైనార్టీ మత పెద్దలు పాల్గొన్నారు.

Next Story