కడుపు కోతలోనూ ప్రాణదానం.. కొడుకు మృతి తరువాత నలుగురికి జీవదానం

by Bhanu |   (  Updated:2025-06-29 16:30:29  IST  )

ఇరవై ఏళ్లు అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్న కొడుకు చేతికి వస్తున్న సమయంలో అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయాడు.

కడుపు కోతలోనూ ప్రాణదానం.. కొడుకు మృతి తరువాత నలుగురికి జీవదానం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇరవై ఏళ్లు అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్న కొడుకు చేతికి వస్తున్న సమయంలో అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయాడు. తన కొడుకు మృతి చెందిన నలుగురి జీవితాలను కాపాడాలన్న ఆ తండ్రి సంకల్పంతో యువకుడు మరణించి నలుగురికి అవయవ దానం చేసి ప్రాణదాతగా నిలిచాడు. మహబూబ్​నగర్​ జిల్లా, జడ్చర్ల, బుర్గుపల్లికి చెందిన కావలి నర్సింహులు కొడుకు కావలి శివప్రసాద్​(22), ఈ మధ్య కాలంలో న్యాయ విద్య అభ్యసిస్తూ ఓ సీనియర్​ లాయర్​ వద్ద అసిస్టెంట్​గా పని చేస్తున్నాడు.

ఈ నెల 17న నగరంలోని బల్కంపేట్​ అమ్మవారి ఆలయం వద్ద జరిగిన ఓ గొడవలో ఓ వ్యక్తి పదునైన ఆయుధంతో శివ ప్రసాద్​ పై దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయాల పాలైన శివ ప్రసాద్​ను నిమ్స్​ ఆసుపత్రిలో చేర్పించారు. ఇదిలా ఉండగా చికిత్స పొందుతున్న శివ ప్రసాద్​ 27న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు.

అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు కండ్ల ముందు విగత జీవిగా మారిన తట్టుకున్న శివ ప్రసాద్​ తండ్రి నర్సింహులు తన కొడుకు మరణాంతరం పలువురికి ప్రాణదానం చేసి జీవించాలని అనుకున్నాడు. తన కొడుకు లివర్​, లంగ్స్​, కిడ్నీలను జీవన్​ దాన్​ సంస్థకు అప్పగించారు. దీంతో జీవన్​ దాన్​ సంస్థ వారు శివ ప్రసాద్​ అవయవాలను నలుగురికి అందజేసి ప్రాణాలు కాపాడారు. పుట్టెడు దుఖంలోను శివ ప్రసాద్​ తండ్రి నర్సింహులు తన కొడుకు అవయవాలను దానం చేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.

Next Story