- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏసీబీ వలలో మూసాపేట్ సర్కిల్ సీఓ మురళి
పొదుపు సంఘాల మహిళలకు రుణాలు మంజూరు చేయించినందుకు లంచం డిమాండ్ చేసి రూ.18వేలు లంచం తీసుకుంటుండగా మూసాపేట్ సర్కిల్ సీఓ (కమ్యునిటి ఆర్గనైజర్)ను ఏసీబీ అధికారులు మంగళవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.

దిశ, కూకట్పల్లి : పొదుపు సంఘాల మహిళలకు రుణాలు మంజూరు చేయించినందుకు లంచం డిమాండ్ చేసి రూ.18వేలు లంచం తీసుకుంటుండగా మూసాపేట్ సర్కిల్ సీఓ (కమ్యునిటి ఆర్గనైజర్)ను ఏసీబి అధికారులు మంగళవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రంగారెడ్డి రేంజ్ డీఎస్పీ ఆనంద్ కమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మూసాపేట్ సర్కిల్, మూసాపేట్ డివిజన్ పరిధిలోని స్వయం సహాయక గ్రూప్ మహిళలకు ఒక్కోక్కరికి రూ. 2 లక్షలు చొప్పున మంజూరు అయిన 20 లక్షల రూపాయల రుణంలో నుంచి తనకు పది శాతం కమిషన్ లంచంగా ఇవ్వాలని, కమ్యునిటి ఆర్గనైజర్గా పని చేస్తున్న మురళి పొదుపు సంఘం మహిళలను డిమాండ్ చేశాడు. అంత ఇచ్చుకోలేము అంటే.. చివరిగా 18 వేలు ఇవ్వాల్సిందే అంటు డిమాండ్ చేశాడు. దీంతో ఆ మహిళలు ఏసీబీ అధికారులన ఆశ్రయించారు. దీంతో ఏసీబి అధికారులు మురళి 18 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.






