పిల్లలతో కలిసి భార్య అదృశ్యం.. ఫోన్ కాల్‌తో భర్తకు పెరిగిన అనుమానం

by Web Desk |
పిల్లలతో కలిసి భార్య అదృశ్యం.. ఫోన్ కాల్‌తో భర్తకు పెరిగిన అనుమానం
X

దిశ, కుత్బుల్లాపూర్ : ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యమైన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం... గాజులరామారం సర్కిల్ రావినారాయణరెడ్డి నగర్‌లో జాదవ్ నరేష్, ప్రమీల(24) దంపతులు నివాసముంటారు. నరేష్ ప్లంబర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్య హౌస్ వైఫ్. వీరికి అభి(3), అన్విక(1.5)లు సంతానం. అయితే గత నెల 9వ తేదీన ఉదయం నరేష్ పనికి వెళ్లి సాయంత్రం 7 గంటలకు వచ్చేసరికి భార్య, పిల్లలు ఇంట్లో లేరు. ముందురోజు ఆలు మగల మధ్య ఘర్షణ జరిగింది.

ఇంటి యజమానిని అడుగగా ప్రమీల తన సోదరిలుతో కలిసి దుస్తుల బ్యాగుతో వెళ్లిందని తెలిపాడు. రోజులు గడుస్తున్న ఆమె ఇంటికి తిరిగి రాలేదు. కాగా, 19వ తేదీన ప్రమీల నుంచి నరేష్‌కు ఫోన్ వచ్చింది. ఎక్కడున్నావని అడిగిన వెంటనే ఆమె ఫోన్ కట్ చేసిందని నరేష్ అన్నారు. దీంతో శనివారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Next Story

Most Viewed