వన మహోత్సవంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే

by velandi.Saikiran |

సోమవారం మోండా డివిజన్, ఈస్ట్ మారేడ్‌పల్లి టీచర్స్ కాలనీ పార్క్‌లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మొక్కలు నాటారు.

వన మహోత్సవంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే
X

దిశ, తిరుమలగిరి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవం 2026 కార్యక్రమంలో భాగంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సోమవారం మోండా డివిజన్, ఈస్ట్ మారేడ్‌పల్లి టీచర్స్ కాలనీ పార్క్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మనం నాటే ప్రతి మొక్క రేపటి తరానికి ఆక్సిజన్ సిలిండర్ వంటిదని తెలిపారు. వనమహోత్సవం స్ఫూర్తితో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. కాలుష్య రహిత కంటోన్మెంట్ సాధన కోసం ప్రతి ఒక్కరు తమ ఇంటి ఆవరణలో ఒక్క మొక్కైనా నాటాల‌ని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బోయిన్‌పల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డాకు నాయక్,హార్టికల్చర్ అధికారి అనీల్ పాల్గొన్నారు.

Next Story