ఇందిరమ్మ క్యాంటీన్ ప్రారంభించిన‌ ఎమ్మెల్యే శ్రీగణేష్

by velandi.Saikiran |

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ క్యాంటీన్ల‌ అల్పాహార కార్యక్రమాన్ని రెజిమెంటల్ బజార్ లోని మదర్ థెరిసా విగ్రహం వద్ద ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే శ్రీ గణేష్.

ఇందిరమ్మ క్యాంటీన్ ప్రారంభించిన‌ ఎమ్మెల్యే శ్రీగణేష్
X

దిశ, తిరుమలగిరి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ క్యాంటీన్ల‌ అల్పాహార కార్యక్రమాన్ని రెజిమెంటల్ బజార్ లోని మదర్ థెరిసా విగ్రహం వద్ద ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజలు, కార్మికులు, విద్యార్ధులకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. 5 రూపాయలకే నాణ్యమైన, రుచికరమైన అల్పాహారాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుందని తెలిపారు.ఇప్పటికే మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న ప్రభుత్వం హరేరామ హరేకృష్ణ సంస్థ భాగస్వామ్యంతో ప్రభుత్వం శుభ్రమైన బ్రేక్ ఫాస్ట్ అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story