క్రీడల వల్ల ఉజ్వల భవిష్యత్తు.. MLA Madhavaram Krishna Rao

by Dishafeatures2 |
క్రీడల వల్ల ఉజ్వల భవిష్యత్తు.. MLA Madhavaram Krishna Rao
X

దిశ, కూకట్​పల్లి: క్రీడల వల్ల ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో బాలాజీ నగర్ డివిజన్ లోని కైత్లాపూర్ మైదానంలో నిర్వహించిన క్రీడా పోటీలను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థులలో మానసిక ఉల్లాసాన్ని, శరీర ధారుఢ్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు. వలం చదువుపైనే ద‌ృష్టిపెట్టకుండా క్రీడల పట్ల కూడా విద్యార్థులు మక్కువ పెంచుకోవాలని సూచించారు. క్రీడా అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ నెల 19 నుంచి 23 వరకు నిర్విహించే ఈ క్రీడా పోటీల్లో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొననున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు చైతన్య యాదవ్, హుడిగి మహేష్​తదితరులు పాల్గొన్నారు.

READ MORE

విద్యార్థులే ఈ ప్రపంచంలో నిజమైన హీరోలు: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి

Next Story

Most Viewed