నీటి శుద్ధికి ఎస్​టీపీ ప్లాంట్ల నిర్మాణం.. MLA మాధవరం కృష్ణారావు

by Dishafeatures2 |
నీటి శుద్ధికి ఎస్​టీపీ ప్లాంట్ల నిర్మాణం.. MLA మాధవరం కృష్ణారావు
X

దిశ, కూకట్​పల్లి: చెరువులలో నీటిని శుద్ధి చేసేందుకు ఎస్​టీపీ ప్లాంట్​లను నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బాలాజీనగర్​ డివిజన్​ పరిధిలోని రేయిన్​బో విస్తాస్​ వద్ద నిర్మిస్తున్న ఎస్​టీపీ ప్లాంట్​ పనులను ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని చెరువులలోని నీటిని శుద్ధి చేసేందుకు కోట్లాది రూపాయల వ్యయంతో ఎస్​టీపీ ప్లాంట్​ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేస్తున్నామని అన్నారు. చెరువులలో నీటిని శుద్ధి చేయడంతో దోమలు, మురుగునీటి సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పగుడాల బాబురావు, డివిజన్ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed