- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
గాయత్రినగర్ డివిజన్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.

దిశ, కూకట్పల్లి: గాయత్రినగర్ డివిజన్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గాయత్రినగర్ డివిజన్ పరిధిలోని పర్వత్నగర్, గాయత్రినగర్ కాలనీలలో 53.50 లక్షల వ్యయంతో చేపడుతున్న తాగునీటి పైప్లైప్ పనులకు ఎమ్మెల్యే మాదవరం కృష్ణారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల కాలంలో అల్లాపూర్ డివిజన్లో వేల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేసామని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నిధులు కొరత లేకుండా అభివృద్ధికి సహకరించారని గుర్తు చేశారు. ఒకప్పుడు వర్షం వస్తే అల్లాపూర్ డివిజన్ పరిధిలో కాలనీలు వరద ముంపు సమస్యతో ఇబ్బంది పడేవారని అన్నారు.
ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును...
డివిజన్ పరిధిలోని అన్ని కాలనీలలో డ్రైనేజి, తాగునీటి పైప్లైన్ వ్యవస్థతో పాటు సీసీ రోడ్డు పనులను చేపట్టడం జరిగిందని అన్నారు. గతంలో నిధులు కెటాయించి శంకుస్థాన చేసిన పనుల ఇప్పటికి పెండింగ్లో ఉన్నాయని, పనులు పూర్తి చేద్దామంటే కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్దే తప్ప కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పనులు జరగడం లేదని అన్నారు. డివిజన్లో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరిశీలించారు. బిఎల్ఎ, బిఎల్ఓలు ప్రజల వద్దకు వెళ్లి వారికి అవగాహన కల్పిస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి సమయాన్ని కెటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమ ఇన్చార్జి గజ్జెల నగేష్, మాజీ కార్పోరేటర్ సబీహ బేగం, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మొహ్మద్ గౌసుద్దీన్, జాహెద్ షరీఫ్ బాబా, లింగాల ఐలయ్య, నూర్, మొయిజ్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.






