- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కళాశాలకు వెళ్లిన బీకాం విద్యార్థిని అదృశ్యం..
దిశ, కూకట్పల్లి: కళాశాలకు వెళ్లిన బీకాం విద్యార్థిని అదృశ్యమైన సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ నరసింగరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఆల్విన్కాలనీ వెంకట పాపయ్య నగర్కాలనీలో నివాసం ఉంటున్న కోరెముల నాగరాజుకు ఇద్దరు సంతానం. పెద్ద కూతురు కే. లికిత రమా(19) కూకట్పల్లి ఏఎస్ రాజు నగర్ కాలనీలోని అవినాష్కళాశాలలో బీకాం చదువుతుంది.
ఈ క్రమంలో రమా 14వ తేది ఉదయం రోజువారీ మాదిరిగా కాలేజీకి వెళ్లి సాయంత్రం వరకు తిరిగి రాలేదు. దీంతో స్నేహితులు, తెలిసిన వారి బంధువుల వద్ద గాలించినా ఫలితం లేక పోవడంతో కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, తన స్నేహితురాలు జ్యోతి తో రమా కళాశాల నుంచి తిరిగి ఇంటికి బయలు దేరిందని తెలిసినట్టు నాగరాజు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరసింగరావు తెలిపారు.