బస్తీ దవఖానాను ప్రారంభించిన మంత్రి తలసాని..

by Disha Web Desk 11 |
బస్తీ దవఖానాను ప్రారంభించిన మంత్రి తలసాని..
X

దిశ, కంటోన్మెంట్/బోయిన్ పల్లి: పేద ప్రజలకు అందుబాటులో వైద్యాన్ని అందించేందుకు బస్తీ దవఖానాలు ఏర్పాటు చేస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. నందమూరి నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవఖానాను మంత్రి శ్రీనివాస్ యాదవ్, కంటోన్మెంట్ ఇంచార్జ్ రాజశేఖర్ రెడ్డి చైర్మన్లు క్రిశాంక్,ఎర్రోళ్ల శ్రీనివాస్, నాగేష్ తో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. కంటోన్మెంట్ నియోజకవర్గంలో పేద ప్రజలకు మంచి వైద్యం అందించాలనే ఆలోచనతో బస్తీ దవాఖాన తీసుకొచ్చినట్లు తెలిపారు.

బస్తీ దవఖానాలో మెరుగైన సౌకర్యాలతో కూడిన వైద్యాన్ని అందించేందుకు వైద్య సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. మరిన్ని ఆసుపత్రులను కూడా అందుబాటులోకి తీసుకురావల్సిన అవశ్యకత ఉందన్నారు. కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యుడిగా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి చెందిన వాళ్లు ఇప్పటికీ చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. కంటోన్మెంట్ లో రాజకీయంగా బిఆర్ఎస్ పటిష్టంగా ఉందని వచ్చే ఎన్నికలలో కూడ గెలిచి సీటు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లాస్య నందిత, నివేదిత, ముప్పిడి మధుకర్, బోయిన్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక ఆనందుబాబు, ప్రవీణ్ యాదవ్ తో పాటు స్థానికులు కృష్ణ, సంజీవ్, ప్రభాకర్ రెడ్డి, బాల్ రెడ్డి, నరహరి, శ్యామ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed