జింఖానా మైదానంలో ఒలింపిక్ రన్..

by Disha Web Desk 20 |
జింఖానా మైదానంలో ఒలింపిక్ రన్..
X

దిశ,కంటోన్మెంట్/ బోయిన్ పల్లి : అంతర్జాతీయ ఒలంపిక్ డే ను పురష్కరించుకొని సికింద్రాబాద్ జింఖానా మైదానం నుండి ఎల్బీ స్టేడియం వరకు కొనసాగే ఒలింపిక్ డే రన్ ను శుక్రవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సిహెచ్ మల్లారెడ్డి, కంటోన్మెంట్ బోర్డు సీఈవో మధుకర్ నాయక్, రాష్ట్ర బెవెరేజెస్ కార్పొరేషన్ ఛైర్మెన్ గజ్జెల నాగేష్, ట్రిపుల్ ఒలింపియన్ ముఖేశ్ మార్, అర్జున్ అవార్డు గ్రహీత అనూప్ కుమార్ యమ, డీఎస్ఓ సుధాకర్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ తదితరులు హాజరై జెండా ఊపి రన్ ప్రారంభించారు.

అనంతరం పలువురు క్రీడాకారులు వివిధ పాఠశాల విద్యార్థులతో కలిసి ఒలింపిక్ టార్చ్ చేతపట్టి రన్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంచి ఆరోగ్య సమాజం కోసం వ్యాయామం చాలా ముఖ్యమని, ప్రతి ఒక్కరు ఆరోగ్యం కోసం గంట కేటాయించాలని మంత్రి అన్నారు. ఈ ఒలింపిక్ రన్ లో టీడీపీ అధికార ప్రతినిధి ముప్పిడి గోపాల్, స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు ప్రభుకుమార్ గౌడ్, వెటరన్ క్రీడాకారులు మునిరాజ్, సత్యనారాయణ, జయరాజ్, ఏసీపీ రవి కుమార్ వివిధ క్రీడాకారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed