ఇంటి పన్నులు పెంచారనేది దుష్ప్రచారమే

by Dishanational1 |
ఇంటి పన్నులు పెంచారనేది దుష్ప్రచారమే
X

దిశ, కుత్భుల్లాపూర్: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంటి పన్నులు పెంచుతున్నట్లు గత కొద్ది రోజులుగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మేయర్ నీలా గోపాల్ రెడ్డి అన్నారు. గత సంవత్సరం నిర్వహించిన సర్వే ప్రకారం డిసెంబర్ 2019నకు పూర్వం నిర్మాణం చేసి పన్నులు చెల్లించుచున్న భవనములకు ఎలాంటి పెనాల్టీ విధించడం లేదని పేర్కొన్నారు. ఒకవేళ ఏమైనా పొరపాటున ఎవరికైనా పాత భవనములకు పెనాల్టీ వచ్చినట్లయితే కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ మేళాలో ఫిర్యాదు చేసినట్లయితే వెంటనే సవరించడం జరుగుతుందన్నారు. ప్రజలు ఎలాంటి దుష్ప్రచారాలను నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గురువారం పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు.

Next Story

Most Viewed