కుత్బుల్లాపూర్ మండల ఆర్ఐ సస్పెండ్..

by Disha Web Desk 11 |
కుత్బుల్లాపూర్ మండల ఆర్ఐ సస్పెండ్..
X

దిశ, కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ మండలం రెవిన్యూ ఇన్ స్పెక్టర్ (ఆర్ఐ) పరమేశ్వర్ రెడ్డిని మేడ్చల్ జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. కుత్బుల్లాపూర్ మండలం లోని ప్రభుత్వ భూముల రక్షణలో విఫలం అయ్యారనే కారణంతో మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్ ఆర్ఐని సస్పెండ్ చేశారు. కుత్బుల్లాపూర్ మండలం ఆర్ఐ సస్పెండ్ కావడంతో రెవిన్యూ కార్యాలయంలో పనిచేసే అధికారులకు, సిబ్బందికి వణుకు మొదలైంది. గాజులరామారం భూ కబ్జాదారులు సైతం ఆర్ఐ సస్పెండ్ వార్త విని ఖంగుతిన్నారు.



Next Story

Most Viewed