వక్ఫ్ బోర్డు బాధితులకు కోదండరాం సంఘీభావం...

by Dishanational1 |
వక్ఫ్ బోర్డు బాధితులకు కోదండరాం సంఘీభావం...
X

దిశ, మేడిపల్లి: వక్ఫ్ బోర్డ్ బాధితుల జేఏసీ ఆధ్వర్యంలో 11వ రోజు రిలే నిరాహారదీక్షకు ప్రొఫెసర్ కోదండరాం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వక్ఫ్ బాధితులు భయపడవలసిన అవసరం లేదని, బాధితులతోపాటు మేము కలిసి ఉద్యమం చేస్తామని అన్నారు. కోదండరాంతోపాటు టీజేఎస్ రాష్త్ర నాయకులు లక్ష్మారెడ్డి, సిటీ ప్రెసిడెంట్ నర్సయ్య, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కె. మాధవి, కన్వీనర్ శ్రీధర్ రెడ్డి, కార్పొరేటర్లు కుంభం కిరణ్ కుమార్ రెడ్డి, కొత్త స్రవంతి కిషోర్ గౌడ్, పోగుల నర్సింహ రెడ్డి, కొత్త కిషోర్ గౌడ్, గోనె శ్రీనివాస్, కూరపాటి విజయ్ కుమార్, సత్యశీల రెడ్డి, ప్రహ్లాద రెడ్డి, రవీంద్ర బాబు పాల్గొన్నారు. దీక్షలో 17 వ డివిజన్ మహిళలు మీనాక్షి, స్వరూప, విజయ, వినోద, శ్యామల, శ్రీవాణి, బృధవని, సులోచన, నర్మద, సరిత కూర్చున్నారు. వారికి జేఏసీ నాయకులు సురేష్, రాజు, శోభ, శ్రీలత, నీరజ, భావన, అంజయ్య యాదవ్, ధనంజయ రావు, విశాల్, మురళి, మహేష్ మరియు నర్సింహులు, శ్రీకాంత్ తోపాటు పెద్ద సంఖ్యలో మహిళలు సంఘీభావం తెలిపారు.

Next Story

Most Viewed