- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కవిత, సీఎం రేవంత్ భూ కుంభకోణంపై విచారణ చేయాలి
కల్వకుంట్ల కవిత, ఆమె భర్త అనిల్, సీఎం రేవంత్ రెడ్డి బినామీ ఏవి రెడ్డితో కలిసి బాలానగర్ మండల పరిధిలోని వేల కోట్ల విలువ చేసే 20 ఎకరాల

దిశ, కూకట్పల్లి: కల్వకుంట్ల కవిత, ఆమె భర్త అనిల్, సీఎం రేవంత్ రెడ్డి బినామీ ఏవి రెడ్డితో కలిసి బాలానగర్ మండల పరిధిలోని వేల కోట్ల విలువ చేసే 20 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేస్తున్నారని స్థానికులు శుక్రవారం మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్ను కలిసి విన్నవించారు. కల్వ కుంట్ల కవిత భర్త అనిల్ పేరుతో తప్పుడు పత్రాలను సృష్టించి, బాలానగర్ మండల పరిధిలోని ఐడిపిఎల్కు చెందిన సర్వే నంబర్ 2010/4లోని 20 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి బినామి ఏవి రెడ్డితో ఈ పని చేసినట్లు తెలిపారు. ఓవర్లాపింగ్ అయిన సర్వే నంబర్లను ఆధారంగా చేసుకుని భూ కబ్జా పర్వాన్ని నడిపించారని ఆరోపణలు చేశారు. తప్పుడు పత్రాలను సృష్టించి, నిర్మాణాలు చేపడుతున్నారని, అందులో ప్లాట్ల విక్రయాలను మొదలు పెట్టారని ఈటల దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై అనేక సార్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్, కలెక్టర్ కు సైతం ఫిర్యాదు చేసినా, స్పందించడం లేదని అన్నారు. ప్రభుత్వ భూమిని కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీ ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు.






