ఆల్విన్​ కంపెనీలో కార్మికునిగా పని చేశాను: ఎమ్మెల్యే కృష్ణారావు

by Kalyani |
ఆల్విన్​  కంపెనీలో కార్మికునిగా పని చేశాను: ఎమ్మెల్యే కృష్ణారావు
X

దిశ, కూకట్​పల్లి: ఆల్విన్​ కంపెనీలో కార్మికునిగా పని చేశానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గుర్తు చేశారు. మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా కేపీహెచ్​బీ కాలనీలో కార్మికుల కోసం రూ. 50 లక్షల వ్యయంతో చేపడుతున్న కార్మిక భవనాన్ని నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం కార్పొరేటర్​ మందాడి శ్రీనివాస్​ రావుతో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన జీవితం సాధారణ కార్మికునిగా ప్రారంభించానని, ఆల్విన్​ కంపెనిలో కార్మికునిగా పని చేశానని, కార్మికుల కష్ట నష్టాలు తెలిసిన వాడినని అన్నారు. కేపీహెచ్ బీ డివిజన్​ పరిధిలోని రమ్య గ్రౌండ్స్​ వద్ద భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేడే సందర్భంగా నిర్వహించిన వేడుకలలో పాల్గొన్నారు.

కార్యక్రమంలో రెండు వందల మంది కార్మికులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో బీఆర్​ఎస్​లో చేరారు. అనంతరం రమ్య గ్రౌండ్​లో కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఆర్​ఎస్​ నాయకులు మందలపు సాయిబాబా చౌదరి, రాజేష్​, పాతూరి గోపి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed