- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్లాట్ ఫామ్ 65 హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు
పీఎన్ఆర్ కాంప్లెక్స్లోని ప్లాట్ ఫాం 65 ట్రైన్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

దిశ, కూకట్పల్లి: కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీ పీఎన్ఆర్ కాంప్లెక్స్లోని ప్లాట్ ఫాం 65 ట్రైన్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రెస్టారెంట్లోని కిచెన్లో అధికారులు ఎలుకలు సంచరించడం, ఆహార నిలువలు పేరుకు పోయి అపరిశుభ్ర వాతావరణాన్ని గుర్తించారు. అదే విధంగా పాచిపోయిన ఆహార నిల్వలను గుర్తించారు. రిఫ్రీరిజిరేటర్స్లో చాలా కాలంగా ఉన్న మాంసపు పదార్థాలు నిలువలు ఉండటాన్ని అధికారులు గుర్తించారు. వెజ్, నాన్వెట్ ఆహార పదార్థాలను వేరు వేరుగా ఉంచకుండా ఒకే చోట నిలువ ఉంచినట్టు అధికారులు గుర్తించారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ రద్దు చేసేందుకు నివేదికను అందజేస్తున్నామని, రెస్టారెంట్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు అందజేస్తున్నట్టు తెలిపారు. పరిశుభ్రత రేటింగ్లో కేవలం 37 శాతం మాత్రమే పాటిస్తున్నారని, నిబంధనల ప్రకారం 50 శాతం కంటే తక్కువ ఉంటే చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు యాజమాన్యాన్ని హెచ్చరించారు.






