రక్తదానం చేసి ప్రాణ దాతలుగా మారండి : సినీ నటుడు మంచు మనోజ్​

by Ratna Kumari |   (  Updated:2026-05-17 13:49:07  IST  )

రక్త దానం చేసి ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేసి ప్రాణ దాతలుగా మారాలని, ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్​ అన్నారు.

రక్తదానం చేసి ప్రాణ దాతలుగా మారండి :  సినీ నటుడు మంచు మనోజ్​
X

దిశ, కూకట్​పల్లి : రక్త దానం చేసి ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేసి ప్రాణ దాతలుగా మారాలని, ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్​ అన్నారు. ఈ నెల 20న మంచు మనోజ్​ పుట్టినరోజు సందర్భంగా మంచు మనోజ్​ అభిమాన సంఘం నాయకులు షేక్​ సత్తార్​, అర్​కే. చౌదరిల ఆధ్వర్యంలో కేపీహెచ్​బీ కాలనీ కమ్యునిటి హాల్​లో ఆదివారం నిర్వహించిన మహా రక్తదాన శిబిరాన్ని మంచు మనోజ్, ఆయ‌న‌​ సతీమణి భూమా మౌనిక ప్రారంభించారు.


రక్తదాన శిబిరం ప్రారంభోత్సవానికి జూబ్లిహిల్స్​ ఎమ్మెల్యే నవీన్​ యాదవ్​, చిన్న శ్రీశైలం యాదవ్​, కమ్మ కార్పొరేషన్​ చైర్మన్​, టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్​, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జెరిపాటి జైపాల్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ జనసేన పార్టీ ఇన్​చార్జి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్, ప్రముఖ సినీ నటుడు భవాని చౌదరిలు పాల్గొన్నారు. రక్త దాన శిబిరంలో పెద్ద సంఖ్యలో యువత, మంచు మనోజ్​ అభిమానులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో వేములవాడ శ్రీనివాస్​, కట్టా నర్సింగరావు, కొల్లా శంకర్​, కొప్పిశెట్టి దినేష్​ కుమార్​, స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకులు, రాజకీయ పార్టీ నాయకులు, కాలనీ వెల్ఫేర్ సంఘాల సభ్యులు అభిమానులు పాల్గొన్నారు.

Next Story