ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి : Minister Malla Reddy

by Dishaweb |
ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి : Minister Malla Reddy
X

దిశ,మేడ్చల్ టౌన్: ముఖ్యమంత్రి కేసీఆర్ హాయంలోని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. సోమవారం మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని గిర్మాపూర్ గ్రామంలో వివిధ పార్టీ చెందిన నాయకులకు కార్యకర్తలు గిర్మాపూర్ మాజీ ఎంపిటిసి వంగేటి రాజిరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శైలజ విజయానంద రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మర్రి నర్సింహారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, నాయకులు రాజశేఖర్ రెడ్డి, యాదగిరి, శంకర్ ముత్యాలు, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed