సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతి

by velandi.Saikiran |

కాంగ్రెస్ నాయకులు పర్వత్ రెడ్డి, కౌకుట్ల జీవన్ రెడ్డి లు సోమవారం జోనల్ కమిషనర్ రాధిక గుప్తాకు వినతి పత్రం అందజేశారు.

సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతి
X

దిశ, నాగారం : నాగారం డివిజన్ పరిధిలోని గోధుమ కుంట, శివ సాయి కాలనీలలో సిసి రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి తక్షణమే పనులు ప్రారంభించాలని కాంగ్రెస్ నాయకులు పర్వత్ రెడ్డి, కౌకుట్ల జీవన్ రెడ్డి లు సోమవారం జోనల్ కమిషనర్ రాధిక గుప్తాకు వినతి పత్రం అందజేశారు. ఈ కాలనీలో సీసీ రోడ్లు లేక వర్షాలు పడితే రోడ్లపై నడవడానికి ఇక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని సీసీ రోడ్ల నిర్మాణ పనులకు అవసరమైన పరిపాలనా అనుమతులు మంజూరు చేసి, బడ్జెట్‌ను వెంటనే విడుదల చేయాలని కమిషనర్ ను కోరారు.

Next Story