పార్కు స్థలం కబ్జాపై ఫిర్యాదు

by velandi.Saikiran |

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి సర్కిల్ లోని జయభేరి పార్క్ స్థలం కబ్జాకు గురైంది.

పార్కు స్థలం కబ్జాపై ఫిర్యాదు
X

దిశ, దుండిగల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి సర్కిల్ లోని జయభేరి పార్క్ స్థలం కబ్జాకు గురైంది. ఈ త‌రుణంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీజనకు కొంపల్లి మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జెమ్మి దేవేందర్ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓపెన్ స్థలాన్ని ప్లాట్లుగా విభజించి అడ్డదారిలో అమ్మకాలు సాగిస్తున్నారన్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదన్నారు.స్టేటస్ కో ఉన్నా అక్రమ అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్టపడడంలేదన్నారు,చర్యలు తీసుకోవాలంటూ సీఎంసి కమిషనర్ శ్రీజనకు ఫిర్యాదు చేసునట్లు తెలిపాడు.

Next Story