గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకే ‘సీఎం కప్’ : మంత్రి మల్లారెడ్డి

by Disha Web Desk 11 |
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకే ‘సీఎం కప్’ : మంత్రి మల్లారెడ్డి
X

దిశ, మేడ్చల్ టౌన్: గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సాహించడంతో పాటు వారిలోని నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం కప్ -2023 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. సోమవారం మేడ్చల్ మండలం కేంద్రం లోనీ బాలురు పాఠశాల అవరణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడల శాఖ అధ్వర్యంలో నిర్వహిస్తున్న సీఎం కప్ - 2023 మండల స్థాయి క్రీడా పోటీలను కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సాహించడంతో పాటు వారిని నైపుణ్యాన్ని వెలికితీయాలానే ఉద్దేశ్యంతో సీఎం కప్ 2023 కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

ముందుగా మండల స్థాయిలో మూడు రోజులపాటు అథ్లెటిక్స్‌, ఫుట్‌బాల్‌, కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్‌ తదితర అంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మండల స్థాయిలో గెలుపొందిన జట్లను జిల్లా పోటీలకు ఎంపిక చేస్తారు. అక్కడా ప్రతిభ చూపితే రాష్ట్ర స్థాయిల్లో అవకాశం కల్పిస్తారని వెల్లడించారు. గ్రామీణ క్రీడాకారులకు వారి ప్రతిభను ప్రదర్శించేందుకు సీఎం కప్ చక్కటి వేదిక అవుతుందని అన్నారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని రాష్ట్ర స్థాయిలో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రజిత రజమల్లరెడ్డి,వైస్ ఎంపీపీ వెంకటేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్,మేడ్చల్ మున్సిపల్ చైర్ పర్సన్ మర్రి దీపిక నర్సింహారెడ్డి, జడ్పిటిసి శైలజ,డబిల్పుర్ పి ఎ సి ఎస్ చైర్మన్ సురేష్ రెడ్డి, ఎంపీడీవో పద్మావతి, నాయకులు మర్రి నర్సింహారెడ్డి సుదర్శన్ ,సందీప్ గౌడ్, హరిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

Next Story