- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
అభివృద్ధిలో దేశానికే దిక్సూచి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన: ఎమ్మెల్యే మాధవరం

దిశ, కూకట్పల్లి: అభివృద్ధిలో దేశానికే దిక్సూచి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్పల్లి డివిజన్ పరిధిలో 1.25 కోట్ల రూపాయలతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం స్థానిక కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనే రాష్ట్రం అభివృద్ధిలో ముందుందని, గత పాలకులు దోచుకోవడం తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందేమి లేదని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం నేడు దేశంలోనే అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా మారిందని అన్నారు. గడిచిన తొమ్మిదేండ్లలో నియోజకవర్గంలో వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ముందు చూపుతోనే నిరంతర అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సంతోష్, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, ఎస్పీ సెల్ అధ్యక్షుడు బొట్టు విష్ణు, నాయినేని అభిలాష్ రావు తదితరులు పాల్గొన్నారు.