క్రమ శిక్షణ కలిగిన కార్యకర్తలు ఉన్న పార్టీ బీఆర్ఎస్​: ఎమ్మెల్సీ పల్లా

by Disha Web Desk 11 |
క్రమ శిక్షణ కలిగిన కార్యకర్తలు ఉన్న పార్టీ బీఆర్ఎస్​: ఎమ్మెల్సీ పల్లా
X

దిశ, కూకట్​పల్లి: సైనికుల్లాంటి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలను బీఆర్ఎస్​ పార్టీ కలిగి ఉందని రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి అన్నారు. కూకట్​పల్లి నియోజకవర్గం పరిధిలోని ఫతేనగర్​ తెలంగాణ గార్డెన్స్​లో మంగళశారం బీఆర్ఎస్​ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతినిధుల సభలో పల్లా రాజేశ్వర్​రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్​ రెడ్డి మాట్లాడుతూ.. దేశ రాజకీయాలలో సమూల మార్పును తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్​ కృషి చేస్తుందని, ముఖ్యమంత్రి కేసీఆర్​ సారధ్యంలో బీఆర్ఎస్​ అన్ని రాష్ట్రాలలో తన ముద్ర వేసేందుకు సిద్ధంగా ఉందని అన్నారు.

అనంతరం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని అన్నారు. ట్రాఫిక్​ సమస్యను అధిగమించేందుకు ఫ్లైఓవర్ బ్రిడ్జిలు, రైల్వే పుట్ ఓవర్​బ్రిడ్జిలు, అండర్​ పాస్​లు, రోడ్డు విస్తరణ పనులను చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు భూగర్భ డ్రైనేజి, తాగునీటి పైప్​లైన్​, వీధి దీపాలు వంటి సదుపాయాలు ప్రతి కాలనీలో కల్పించేందుకు కృషి చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పండాల సతీష్ గౌడ్​, ఆవుల రవీందర్​ రెడ్డి, జూపల్లి సత్యనారాయణ, సబీహ బేగం, ముద్దం నర్సింహా యాదవ్​, మందాడి శ్రీనివాస్​ రావు, శిరీషా బాబురావు, మాజీ కార్పొరేటర్​లు తూం శ్రావణ్​ కుమార్​, కాండూరి నరేంద్ర చార్యా, బాబురావు తదితరులు పాల్గొన్నారు.

Next Story