మహిళపై దాడి చేసి సెల్ ఫోన్ పగలగొట్టిన బీఆర్ఎస్ పార్టీ నేత (వీడియో)

by Disha Web Desk 12 |
మహిళపై దాడి చేసి సెల్ ఫోన్ పగలగొట్టిన బీఆర్ఎస్ పార్టీ నేత (వీడియో)
X

దిశ, మల్కాజ్గిరి: బీఆర్ఎస్ నేతలు కొందరు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. తమకు అగ్ర నేతల అండదండలతో పాటు పోలీసుల మద్దతు ఉందనే ధీమాతో విచ్చల విడిగా వ్యవహరిస్తూ.. మహిళలపై దాడులకు తెగబడుతున్నారు. ఇందుకు మల్కాజిగిరి సర్కిల్ నేరేడ్ మెట్ డివిజన్‌లో వెలుగుచూసిన ఘటనే నిలువెత్తు నిదర్శనం. డివిజన్ పరిధిలోని మణి ఎన్‌క్లేవ్‌లో మారు అంజయ్య ఇంటి సమీపంలోని రోడ్డుపై మట్టి పోయించారు.

ఈ విషయమై కాలనీ నుంచి మున్సిపల్ అధికారులకు అందిన ఫిర్యాదు మేరకు నేతలు జేసీబీతో వచ్చి మట్టి తొలగించేందుకు యత్నించారు. ఇందుకు అంజయ్య కూతురు అజితామారు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుండగా స్థానిక కార్పొరేటర్ భర్త ఉపేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ నాయకులు మహిళ సెల్ ఫోన్ పగులగోట్టడమే కాకుండా పోలీసుల ఎదుటే చేయి చేసుకున్నారని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.



Next Story

Most Viewed