- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజా ఆరోగ్యం కోసం ప్రభుత్వం పెద్ద పీట
ప్రజా ఆరోగ్యానికి ప్రజా ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ అన్నారు. బాలానగర్ డివిజన్

దిశ, కూకట్పల్లి: ప్రజా ఆరోగ్యానికి ప్రజా ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ అన్నారు. బాలానగర్ డివిజన్ సాయినగర్కు చెందిన పాలడుగు వెంకటకృష్ణ గత కొంత కాలంగా తీవ్ర ఆనారోగ్యంతో బాధ పడుతు వైద్యం కోసం ఆర్థిక పరిస్థితి సహకరించక ఇబ్బంది పడుతున్నారు. ఇక ఈ తెలుసుకున్న బండి రమేష్, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 8.80 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించేల చర్యలు తీసుకున్నారు.
శనివారం చెక్కును వెంకటకృష్ణ నివాసానికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రజా ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిలుకూరి చందు, సిద్దు, లక్ష్మణ్, పుష్ప రెడ్డి, మల్లికార్జున్ గౌడ్, యుగేందర్ రెడ్డి, పులి శివకుమార్ గౌడ్, శ్రీకాంత్ పటేల్, శ్రీనివాస్ గౌడ్, మధు, రామ్మోహన్ రావు, భరత్, నరేందర్, మహేందర్, రేణుక, సాయి భారతి తదితరులు పాల్గొన్నారు.






