- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేపీహెచ్బీలో అన్ని అక్రమ నిర్మాణాలే..!
దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు నివాసం ఉంటున్న మినీ ఇండియాగా పేరుగాంచిన కూకట్పల్లిలో సొంతిల్లు తీసుకుకోవాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది.

దిశ,కూకట్పల్లి: దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు నివాసం ఉంటున్న మినీ ఇండియాగా పేరుగాంచిన కూకట్పల్లిలో సొంతిల్లు తీసుకుకోవాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. హైటెక్సిటీకి కూతవేటు దూరంలో ఉండటం, అన్ని వాణిజ్య, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు కూకట్పల్లి ప్రాంతంలో ఉండటంతో లక్షలాది మంది తమ నివాసం కోసం కూకట్పల్లి ప్రాంతాన్ని ఎంచుకుంటు ఉంటారు. సరిగ్గా ఈ కలనే టార్గెట్గా చేసుకున్న కొంత మంది మధ్య తరగతి కుటుంబాలను టార్గెట్గా చేసుకుని తమ రియల్ దందాను మూడు పువ్వులు ఆరు కాయలుగా నిర్వహిస్తున్నారు. అపార్ట్మెంట్లో ఫ్లాట్ల డిమాండ్ ఉండటంతో చిన్నపాటి స్థలంలో అక్రమంగా అదనపు అంతస్థులు నిర్మిస్తు మధ్య తరగతి కుటుంబాలను, చిరు ఉద్యోగులను నమ్మించి మోసం చేస్తు తమ వ్యాపారాన్ని చేపడుతున్నారు. కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని అత్యంత ఖరీదైన ప్రాంతం కేపీహెచ్బీకాలనీ. ఇక్కడ పేద, మధ్య తరతగతికి చెందిన ప్రజల నుంచి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సినీ తారలు సైతం నివాసం ఉండే కాలనీలు ఉన్నాయి.
అక్రమ నిర్మాణాలే..
కేపీహెచ్బీకాలనీలో ఫేజ్ 1 నుంచి 15, గోకుల్ ప్లాట్స్, భగత్సింగ్ నగర్, సర్దార్పటేల్ నగర్, వసంత్నగర్ కాలనీ, ఎన్ఆర్ఎస్ఏ కాలనీలో ఎక్కడ పడితే అక్కడ బిల్డర్లు తీసుకున్న అనుమతులకు మించి నిర్మాణాలు చేపడుతు జీహెచ్ఎంసీ, ప్రభుత్వ ఖజానాకు భారీ గండి కొడుతున్నారు. కేపీహెచ్బీ కాలనీ లో ప్రధానంగా 15 ఫేజ్, 9వ ఫేజ్, గోపాల్ నగర్, భగత్సింగ్ నగర్, ఎంఐజి1,2, ఎల్ఐజి, హెచ్ఐజి కాలనీలలో నిబంధనలకు విరుద్ధంగా అనేక నిర్మాణాలు చేపడుతు బిల్డర్లు జీహెచ్ఎంసీ పట్టణ ప్రణాళిక విభాగానికి సవాల్ విసురుతున్నారు.
అధికారుల తీరు ప్రశ్నార్థకం..
మూసాపేట్ సర్కిల్ పరిధిలో నిబంధనలకు విరుద్దంగా అక్రమ నిర్మాణ చోటు చేసుకుంటుంటే వాటిని అరికట్టాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఇద్దరు డీసీలు మారారు, గతంలో ఉన్న డీసీ అక్రమ నిర్మాణాలను యధేచ్చగా ప్రోత్సాహించి తనకు రావలసిన కాసులను దండుకుని సైలెంట్గా ఉండటం తో అక్రమ నిర్మాణాల సంఖ్య గణనీయంగా పెరిగిందనే ఆరోపణలు ఎక్కవగా వినిపిస్తున్నాయి. కొత్తగా ఛార్జ్ తీసుకున్న డీసీ ప్రస్తుతం సర్కిల్ పరిధిలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకే సమయం దొరకడం లేదు. దానికి తోడు టౌన్ప్లానింగ్ విభాగంలో అధికారులు పూర్తి స్థాయిలో లేకపోవడం, ఒక ఏసీపీ, ఒక టీపిఎస్తో పెద్ద సర్కిల్లో పట్టణ ప్రణాళిక విభాగాన్ని నడిపించడం సాధ్యం కావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారుల లేమి అక్రమ నిర్మాణలు చేపడుతున్న బిల్డర్ల పాలిట వరంగా మారిందనే చెప్పవచ్చు.




