అత్యాచారం కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగారా శిక్ష..

by Disha Web Desk 11 |
అత్యాచారం కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగారా శిక్ష..
X

దిశ, మల్కాజిగిరి: అత్యాచారం కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగారా శిక్ష విధిస్తూ మల్కాజిగిరి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం మల్కాజిగిరి డీసీపీ ధరావత్ జానకి వెల్లడించారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార కేసులో ఒరిస్సాకు చెందిన నిందితుడు అభిరామ్ దాస్ (36)కు యావజ్జీవ శిక్ష విధించింది.

బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీకి ఆదేశాలు జారీ చేసింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధి బండ్లగూడలో నమోదైన ఫోక్సో కేసులో కోర్టు తీర్పు వెల్లడించిందని డీసీపీ జానకి తెలిపారు. కేసులో నిందితుడికి శిక్షపడే విధంగా సహకరించిన పోలీస్ సిబ్బందికి, అడిషనల్ పీపీ ఉపేందర్, రజనీని అభినందించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed