పోలీసుల చెంత మతిస్థిమితం లేని మహిళ

by Dishanational2 |
పోలీసుల చెంత మతిస్థిమితం లేని మహిళ
X

దిశ, కుత్బుల్లాపూర్ : మతిస్థిమితం లేని మహిళను జగద్గిరిగుట్ట పోలీసులు చేర దీశారు. పోలీసుల కథనం ప్రకారం.. జగద్గిరిగుట్ట దీనబంధు కాలనీలో గుర్తు తెలియని మహిళ(40) అటూ ఇటూ తిరుగుతూ స్థానికులకు కనిపించగా, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా పేరు కూడా చెప్పలేని స్థితిలో మహిళ ఉంది. మతిస్థిమితం సరిగా లేక తప్పిపోయి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని తెలిపారు.



Next Story

Most Viewed