రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

by velandi.Saikiran |

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘ‌ట‌న శామీర్ పేట్ లో చోటు చేసుకుంది

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
X

దిశ, శామీర్ పేట్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘ‌ట‌న శామీర్ పేట్ లో చోటు చేసుకుంది. శామీర్ పేట్ గ్రామానికి చెందిన వల్లపు శ్రీనివాస్ (52) శుక్రవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై తన ఇంటికి వెళ్తుండగా, అరణ్య రిసార్ట్ వద్ద అశోక్ లెలాండ్ గూడ్స్ క్యారియర్ వాహనం అతివేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ తలకు తీవ్ర రక్త గాయాలు అయ్యి అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని శామీర్ పేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story