చేపల వేటకు వెళ్లి యువకుడి దుర్మరణం..

by Kodari Anjali |

చేపల వేటకు వెళ్లి చెరువులో పడి ఓ యువకుడుమృతి చెందిన సంఘటన మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామంలో జరిగింది.

చేపల వేటకు వెళ్లి యువకుడి దుర్మరణం..
X

దిశ, వెల్దుర్తి: చేపల వేటకు వెళ్లి చెరువులో పడి ఓ యువకుడుమృతి చెందిన సంఘటన మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పెద్ది రమేష్(35) సోమవారం సాయంత్రం గ్రామ శివారులో ఉన్న చెరువులో చేపల వేట కోసం వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో మృతి చెందినట్లు తెలిపారు. దీంతో స్థానికులు పోలీసులకు కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదుచేసి మృతదేహాన్ని తూప్రాన్ ప్రభుత్వ మార్చురికి తరలించారు.

Next Story