రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి..

by Kodari Anjali |

మరికల్ మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన నెలకొంది.

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి..
X

దిశ, మరికల్: మరికల్ మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన నెలకొంది. పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి మరికల్ పట్టణం రాయచూరు రోడ్డు సరస్వతి గుడి ముందు ఆటో ఓ వ్యక్తిని ఢీకొనగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తిని ఆటో డ్రైవర్ కన్మనూర్ రోడ్డు సమీపంలో వదిలిన సంఘటన నెలకొంది. మృతి చెందిన వ్యక్తి మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన మహమ్మద్ సలీంగా గుర్తించారు. ఈ సంఘటనపై దర్యాప్తు జరిపి పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఎస్సై విక్రమ్ తెలిపారు.

Next Story