నన్ను గెలిపించండి : జగ్గారెడ్డి

by Disha Web Desk 22 |
నన్ను గెలిపించండి : జగ్గారెడ్డి
X

దిశ, సంగారెడ్డి: సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి తనతోనే జరిగిందని మరింత అభివృద్ధి కోసం తనను గెలిపించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి కోరారు. మంగళవారం సంగారెడ్డి పట్టణంలోని కింది బజార్ నవరాత్నాలయంలో పూజలు నిర్వహించి ప్రచారం మొదలు పెట్టారు. ప్రచారం నిర్వహించిన జగ్గారెడ్డి ఇంటింటి ప్రచారంతో పాటు రోడ్డు పై నడుచుకుంటూ శివాజీనగర్, నాల్సాబ్ గడ్డలో ప్రజలను, వ్యాపారులను కలుస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సంగారెడ్డి నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి మాత్రమే ఉందన్నారు. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. సంగారెడ్డి అభివృద్ధి కోసం తనను మరొకసారి గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు తోపాజీ అనంతకిషన్, కూన సంతోస్, సీపీఐ నాయకులు తాజోద్దీన్, మహబూబ్ అలీ తదితరులు పాల్గొన్నారు.



Next Story