స్వరాష్ట్ర సాధనలో అమరుల త్యాగం మరువలేము

by Taduka Kalyani |

తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాన్ని మరువలేమని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం. కోదండరాం అన్నారు.

స్వరాష్ట్ర సాధనలో అమరుల త్యాగం మరువలేము
X

దిశ, మిరుదొడ్డి: తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాన్ని మరువలేమని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం. కోదండరాం అన్నారు. గురువారం మిరుదొడ్డి మండలం కొండాపూర్ గ్రామంలోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి తెలంగాణ ఉద్యమకారులతో కలిసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అమరుల త్యాగాన్ని శాశ్వతంగా గుర్తుంచుకోవడంలో భాగంగా స్థూపాన్ని నిర్మించడం అభినందనీయమన్నారు. అమరుల త్యాగాల ఫలితం గానే తెలంగాణ సాధ్యమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో డా. పెద్దిరాజు, డా. పాపయ్య, తిరుపతిరెడ్డి, ఎం.డి. గౌస్ ఉద్దీన్, శ్రీహరి, కొండి మల్లారెడ్డి, మముద్ పాష ,లక్ష్మారెడ్డి, సుకురి ప్రవీణ్, శ్రీధర్, ఆరేపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.

Next Story