ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

by Ratna Kumari |

మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ నియమావళి ఉల్లంఘిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవని సిద్ధిపేట జిల్లా పోలీసు కమిషనర్ రష్మీ పెర్మల్ అన్నారు.

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
X

దిశ, చేర్యాల : మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ నియమావళి ఉల్లంఘిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవని సిద్ధిపేట జిల్లా పోలీసు కమిషనర్ రష్మీ పెర్మల్ అన్నారు. గురువారం చేర్యాల మున్సిపల్ పరిధిలోని ఎన్నికల నామినేషన్ సెంటర్ ని సీపీ పరిశీలించారు. ఈ సంధర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఎన్నికలకు పటిష్టమైన భద్రతను పోలీసు శాఖ ఏర్పాటు చేస్తామని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి అధికారులకు రాజకీయనాయకులు, ప్రజలు సహకరించాలని కోరారు. సీపీ వెంట చేర్యాల సీఐ భానోతు రమేష్, ఎస్సై నవీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.నాగేందర్, సీనియర్ అసిస్టెంట్ కృష్ణ ఉన్నారు.

Next Story