సంగారెడ్డి జిల్లా నూతన డీఈవోగా వెంకటేశ్వర్లు

by Disha Web Desk 1 |
సంగారెడ్డి జిల్లా నూతన డీఈవోగా వెంకటేశ్వర్లు
X

దిశ, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా నూతన డీఈవోగా వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం సంగారెడ్డిలోని విద్యా శాఖ కార్యాలయంలో నూతన డీఈవోగా రిజిస్టర్ లో సంతకం చేసి బాధ్యతలను స్వీకరించారు. అనంతరం సంగారెడ్డి జిల్లాకు బదిలీ పై వచ్చిన నూతన డీఈవో వెంకటేశ్వర్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ ను శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లా డీఈవోగా పని చేసి బదిలీపై సంగారెడ్డి జిల్లాకు వచ్చినట్లు ఆయన తెలిపారు.


Next Story

Most Viewed