అనుమానస్పద స్థితిలో మహిళ మృతి

by Dishanational2 |
అనుమానస్పద స్థితిలో మహిళ  మృతి
X

దిశ, జిన్నారం : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని వెంకట్ రెడ్డి నగర్‌లో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన బుధవారం కలకలం రేపింది. స్థానికంగా నివసిస్తున్న జ్యోతి రామకృష్ణారెడ్డి లు భార్యాభర్తలు. జ్యోతి ( 23) అనుమానాస్పద స్థితిలో ఇంట్లో మృతి చెందింది. కాగా బయట నుంచి ఇంటికి తాళాలు వేయడంతో ఆమె మృతి పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు సమాచారం అందించడం తో ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story