అనుమాన‌స్ప‌దంగా మ‌హిళా మృతి

by Ratna Kumari |

మండలంలోని ముని గడపలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినది.

అనుమాన‌స్ప‌దంగా మ‌హిళా మృతి
X

దిశ‌, జ‌గ‌దేవ‌పూర్ : మండలంలోని ముని గడపలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మునిగడప గ్రామానికి చెందిన శివరాత్రి జ్యోతి (37) బుధవారం ఉదయం హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వెళ్తున్నట్లు తన తల్లి నర్సవ్వకు ఫోన్ చేసి తెలిపింది. అనంతరం గురువారం ఉదయం జ్యోతి మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు నర్సవ్వకు సమాచారం అందించారు. కూతురు మృతి పట్ల అనుమానం వ్యక్తం చేసిన నర్సవ్వ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతికి గల కారణాలపై విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story